19 March, 2026 | 3:04 PM

పోటీగా సాగిన తైబజార్ వేలం..రూ.6 లక్షలకు పైగా ఆదాయం..

18-03-2026 12:00 AM

సిరికొండ, మార్చి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని  సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తైబజార్ వేలంపాటను సర్పంచ్ సాయిచరణ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించేందుకు నిర్వహించిన ఈ వేలంలో పలువురు ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని పోటీగా బిడ్లు వేశారు. తీవ్ర పోటీ మధ్య హమాలి భూమన్న అత్యధికంగా రూ.6,03,200 బిడ్ నమోదు చేసి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

ఈ వేలం కార్యక్రమం వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ అధికారులు, ఇతర సభ్యుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిచరణ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఇలాంటి వేలాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.