10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకూ వెళ్లాలి

24-12-2025 12:00 AM

18 గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానం

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని 18 గ్రామాల కాం గ్రెస్ పార్టీ సర్పంచులకు, ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువులతో సన్మానించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ప్రధా న కార్యదర్శి దివిటి కిష్టయ్య,సీనియర్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలోని ప్రతి గడపగడపకు వెళ్లాలని తెలిపారు.

అలాగే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి తీర్చిది ద్దాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఒడిదడుగులు ఏర్పడిన తమ దృష్టికి తీసుకురా వాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పని చేయకూడదని అన్నారు. గ్రామంలో ఎవరైనా తమ సమస్య గురించి వస్తే సంపూర్ణంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామం లో ప్రతి సమస్యపై స్పందించి పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు.

గ్రామాల్లో విద్య,వైద్యం, త్రాగునీరు, మురికి కాల్వలు, వీధి దీపాలు, పారిశుధ్య పనులు, రహదారులు, చెరువుల అభివృద్ధి మౌలిక సదుపా యాల అంశాలపై దృష్టి సాధించాలన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ఐక్యమత్యంతో అన్ని అంగుళాలతో గ్రామాల అభివృద్ధిదేంగా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు యాద గౌడ్, శంకర్, వెంకట్ గౌడ్, సంజీవరావు, భాగ్యశ్రీ, సురేష్,రోజా, పద్మ, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుగౌడ్, ఉప సర్పంచులు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, తాండూర్ సొసైటీ మాజీ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టయ్య,సీనియర్ రామచంద్ర రెడ్డి, విట్టల్ రెడ్డి, వాసురెడ్డి, బాల్ రెడ్డి, నిరు డి రాజు, కోనేరు కుమార్, శ్రీరామ్ గౌడ్, సుభాష్ రెడ్డి, గంపల వెంకయ్య, జీవరత్నం, వస్రం నాయక్, రవి గౌడ్, హనుమంత్ రెడ్డి, మురళి గౌడ్, ప్రభాకర్,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.