20 March, 2026 | 8:30 AM

సీఎం రేవంత్‌రెడ్డికి శ్రీరామనవమి ఆహ్వానం

20-03-2026 12:23 AM

బ్రహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సురేఖ, దేవస్థానం కమిషనర్ తదితరులు 

భద్రాచలం, మార్చి 19 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 27వ తేదీన జరిగే శ్రీరామనవమికి రావాల్సిందిగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థా నం తరఫున గురువారం హైదరాబాదులో ఆహ్వానించారు.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థానం కమిషనర్ హనుమంతరావు, భద్రాచలం ఈవో దామోదర్ రావు, భద్రాద్రి దేవస్థానం అర్చకులు సం యుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఆహ్వా న పత్రికను అందజేసి ఆహ్వానించారు. ము ఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తాను అని సీఎం హామీ ఇచ్చారు.