10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

07-01-2026 12:26 AM

ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే నాగోబా జాతర ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరపు నుంచి చేపట్టే బందోబస్తు ఏర్పాట్లను  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పరిశీలించారు. మంగళవారం సాయంకాలం నాగోబా ఆలయానికి చేరుకున్న ఎస్పీ ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి నాగోబా దేవుడికి పూజలు నిర్వహించారు. అనంతరం జాతర సందర్భంగా బందోబస్తుతో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డులను పరిశీలించారు. 

జాతర  సందర్భంగా చట్ట వ్యతిరేక పనులు, దొంగతనాలు, జూదం, లాటరీలు ప్రజలను మోసగించే పనులు చేసే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ తో  శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్,  డి.ఎస్.పి పోతారం శ్రీనివాస్, సీఐ  మడవి ప్రసాద్, ఎస్సై సాయన్న, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.