calender_icon.png 8 February, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతా పయనం భావోద్వేగభరితం

08-02-2026 12:53:26 AM

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతుండగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ముఖ్యపాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుండగా, అతని మేనల్లుడు ధ్రువ సర్జా ఓ కామియో రోల్‌లో కనిపించనున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్.. విజువల్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మెయిన్ అస్సెట్‌గా నిలిచేట్టున్నాయి. మాస్ యాక్షన్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా అన్నిరకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ‘ఇల్లు అంటే గదులు కాదు.. బంధాలు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి జీ బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.