22 July, 2026 | 3:40 PM

Breaking News

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •   NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధం: జేపీ నడ్డా   •  

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌ఓ కె. కృష్ణ

22-07-2026 02:34 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. కృష్ణ హెచ్చరించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గర్భిణుల రికార్డులు, ఫారం-ఎఫ్‌లను పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి స్కానింగ్ అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, చేయించుకున్నా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు నిర్వహించే వైద్యులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారని చెప్పారు. అవసరమైతే మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి వైద్యుల ప్రాక్టీస్‌ను నిలిపివేయించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ సేవల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.