22 July, 2026 | 3:53 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్ధం: జేపీ నడ్డా

22-07-2026 03:13 PM

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్(NEET paper leak)పై పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. రాజ్యసభలో కేంద్రమంత్రి, సభ నాయకుడు జేపీ నడ్డా(J.P. Nadda) స్టేట్ మెంట్ ఇచ్చారు. "ఇండి (INDI) కూటమి తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించారు. పార్లమెంటులో వారి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రవర్తనను మనం స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.

కాంగ్రెస్ వల్ల పార్లమెంటరీ మర్యాదలు కాలరాయబడుతున్నాయి, ప్రజాస్వామ్య విలువలు ఉల్లంఘించబడుతున్నాయని ఫైర్ అయ్యారు. అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పుడే స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, నీట్ (NEET) పేపర్ లీక్, దానికి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించడానికి కూడా NDA ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తమది పారదర్శకమైన ప్రభుత్వమని పేర్కొన్నారు.

బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. ప్రతిపక్షం ప్రజా వ్యతిరేక చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని విమర్శించారు. రాజ్యసభలో NEET UG 2026 పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ... "సమర్థవంతమైన లేదా నిష్పాక్షికమైన చర్చ జరగాలంటే, ముందుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేసేంత వరకు ఇక్కడ ఎటువంటి చర్చ జరగదని పేర్కొన్నారు.