2 July, 2026 | 4:08 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

జలాశయాల వద్ద భద్రతా చర్యలు

21-04-2026 12:15 AM

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 20 : పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జలాశయాల వద్ద ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సరైన రక్షణ చర్యలు లేక ఇటీవల అనేక చోట్ల ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని ప్రమాదకరమైన నీటి ప్రాంతాలను గుర్తించి,  స్పష్టంగా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డులు, డేంజర్ ఇండికేటర్లను ఏర్పాటు చేయాలని అదేశించారు.

బహిరంగంగా ఉన్న బావులు, లోతైన నీటి కుంటల చుట్టూ రక్షణ కంచెలు లేదా గోడలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారని తెలియజేశారు. సిద్దిపేట పోలీసు శాఖ చేపట్టిన ఈ భద్రతా చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.