గట్ల గౌరవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్
25-06-2026 01:18 PM
ఎర్రుపాలెం జూన్ 25 (విజయక్రాంతి): గురువారం నాడు గట్ల గౌరవరం గ్రామంలో సర్పంచి బండ్ల రాణి నవ శకం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా మందులు ఇస్తారని సర్పంచ్ పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నవ సకం ఫౌండర్ రమేష్ ను గ్రామ పెద్దలు అభినందించారు.






