6 May, 2026 | 6:34 PM

ఉచిత కరాటే శిక్షణ శిబిరం ప్రారంభించిన సర్పంచ్ జీరెడ్డి మహేందర్

06-05-2026 05:58 PM

ధర్మపురి,(విజయ క్రాంతి): జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి ఉచిత కరాటే (కుంగ్ ఫూ) శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. కరాటేపై ఆసక్తి ఉన్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి కాలం సెలవు దృష్ట్యా 8 సంవత్సరాలు పైబడిన ఆడ, మగ పిల్లలకు ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సదావకాశాన్ని పిల్లలు ఉపయోగించుకోవాలని ఈ శిక్షణ తరగతులు 06.05.2026 నుండి 15.05.2026 వరకు కొనసాగుతాయనీ తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ సీనియర్ కరాటే మాస్టర్ రాజమల్లయ్య ద్వారా  ఇవ్వబడుతున్నట్లు సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు.