26 April, 2026 | 5:45 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

05-03-2026 12:41 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ జేఏసీ వినతి

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ మేరకు జేఏసీ, ఆర్టీసీ వివిధ సంఘాల నాయకులు ఈ.అశ్వత్థామ రెడ్డి, మర్రి నరేందర్, ఎర్ర స్వామికుమార్, పున్న హరికిషన్, రామావతారం తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

తమ డిమాండ్లను పరిష్కరించుకుటే ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ 15 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.