కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు
28-04-2026 04:03 PM
హైదరాబాద్: మెదక్ జిల్లా కొల్చారం జాతీయరహదారిపై(Kulcharam National Highway) మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొని 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషయం, మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బోధన్ డిపో బస్సు(Bodhan Depot Bus) హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తూ ధాన్యం లారీని బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కొల్చారం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






