28 April, 2026 | 5:18 PM

Breaking News

జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •  

కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా వర్క్‌షాప్‌లో మంటలు

28-04-2026 03:41 PM

హైదరాబాద్: నగరంలోని బహదూర్ పురాలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. కిషన్ బాగ్(Kishan Bagh) లోని సోఫా తయారీ కేంద్రంలో భారీగా మంటలు ఎగిరిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ కమ్మేసింది. మంటల ధాటికి సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. లక్షల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ఫ్లైవుడ్లు, సోఫా సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.