13-02-2026 12:00:00 AM
శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 12: శ్రీరంగాపురం మండలంలో మాసం శాఖాద్రి దుర్గా ఉన్న ముస్లిం స్మశాన వాటికకు రక్షణ గోడ (కాంపౌండ్ వాల్), నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీ నాయకులు మండల కాంగ్రెస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డిని కలిసి వినతిపత్రం స మర్పించారు.
ఈ సందర్భంగా ఇస్ మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ వహీదుద్దీన్ మాట్లాడు తూ, స్మశాన వాటికకు కాంపౌండ్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భ ద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. సమాజానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కాంపౌండ్ వాల్ అత్యవసరమని తెలిపారు.అలాగే ముస్లిం సమాజ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవసరమని పే ర్కొన్నారు.
ప్రస్తుతం సరైన వసతులు లేకపోవడంతో కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.