భక్తిశ్రద్ధలతోనే సుఖసంతోషాలు
బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జీ మహేందర్ రెడ్డి
జవహర్ నగర్,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతోనే సుఖసంతోషాలు కలుగుతాయని, శివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జీ మహేందర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురికాలనీ డివిజన్లోని బృందావన్ కాలనీలోని దేవాలయంలో లింగ పునప్రతిష్టాపన, ధ్వజస్థంభోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జీ చామకూర మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద వితరణను బీఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, నాయకులు రాజశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






