10 July, 2026 | 7:39 PM

Breaking News

నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమాలు ఉధృతం: ఏఐఎస్ఎఫ్   •   గుల్పర్తిలో సిగ్నల్ వ్యాధులపై అవగాహన   •  

37 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

17-11-2025 10:26 PM

జిన్నారం/అమీన్ పూర్: బొల్లారం, జ్యోతినగర్ ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్న ఘటన బయటపడింది. స్థానిక అధికారులకు లభించిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో 80 బస్తాలు సుమారు 37 క్వింటాళ్లు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, ఆటో యజమాని జైపాల్‌తో పాటు అక్రమంగా రేషన్ బియ్యం విక్రయించిన రేషన్ డీలర్ అలివేలమ్మపై కూడా చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.