26 May, 2026 | 6:49 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

వ్యభిచారం గృహంపై దాడి

09-01-2026 12:00 AM

ఒకరి అరెస్టు, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలింపు 

ఎల్బీనగర్, జనవరి 8 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పతిధిలోని కమ్మగూడలోని హర్షిత గెస్ట్ హౌజ్ లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఒకరిని అరె స్టు చేయగా, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.బాధిత ఇద్దరు యువతులు ఢిల్లీ,ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కమ్మగూడ లోని హర్షిత గెస్ట్ హౌస్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగ్గ సమాచారం రాగా, సెర్చ్ పర్మిషన్ తీసుకొని బుధవారం వనస్థలిపురం పోలీసులు దాడి చేశారు.

గెస్ట్ హౌస్‌లో తనిఖీ చేయగా ఇద్దరు మహిళలతోపాట రిసెప్షనిస్టు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న మచిలీపట్టణానికి షేక్ ఖలీల్ తండ్రి ఇస్మాయిల్ (27)ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు, ఇద్దరి మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. ఆర్గనైజర్ ఆదిత్య చౌదరి పరారీలో ఉన్నట్లు చెప్పారు.