9 May, 2026 | 9:48 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

07-01-2026 12:04 AM

ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్ స్వప్న

గోపాలపేట, జనవరి 6: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించి వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సర్పంచ్ స్వప్న భాస్కర్ అన్నారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి ఉంటా మహిళలతో మాట్లాడారు. ప్రతిరోజు మెనూ ప్రకారం వంటకాలు చేస్తున్నారా లేదా అని ఉంట మహిళలను హారతిశారు.

విద్యార్థులకు వేడివేడి మంచి భోజనాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వం కూడా పాఠశాలలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.