26 May, 2026 | 5:31 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కలెక్టరేట్‌లో పుట్టపర్తి సత్యసాయి శత జయంతి

24-11-2025 01:30 AM

నిర్మల్ నవంబర్ 23(విజయక్రాంతి) : ఆదివారం కలెక్టర్ సమావేశమందిరంలో పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో రత్నకళ్యాణి, సేవా సమితి సభ్యులు సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి తమ భక్తిని చాటారు. పలువురు మాట్లాడుతూ, సత్యసాయి సమాజానికి ఎన్నో విలువైన సేవలు చేశారని కొనియాడారు.

పేదలకు విద్య, వైద్యం, త్రాగునీరు, వంటి సేవలను అందించారని వివరించారు. సేవ, ప్రేమ, కరుణ వంటి అంశాలతో సమ సమాజ స్థాపన కొరకు పుట్టపర్తి సత్యసాయి పాటుపడ్డారని వివరించారు. ఈ జయంతి వేడుకలలో డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు భీమ్ సేన్, కన్వీనర్ హరి చరణ్, సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.