23 April, 2026 | 3:20 AM

టీచర్లకు నష్టం కలిగించే అంశాలు తొలగించాలి

23-04-2026 01:50 AM

మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికలో ఉపాధ్యాయులకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుకు వినతిపత్రం సమర్పించారు.

విద్యాకమిషన్ నివే దికలో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని తొలగించాలని కోరారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, సాం ఘిక శాస్త్రానికి సంబంధించిన మ్యాప్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతోపాటు సీఎంతో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.