7 March, 2026 | 4:19 PM

Breaking News

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •  

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

07-03-2026 02:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి, రోగులకు సమయానికి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్యుల హాజరు వంటి అంశాలపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కలెక్టర్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు.