3 July, 2026 | 9:47 PM

Breaking News

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •  

వేల కోట్ల భూమికి రక్షణ

13-02-2026 12:00 AM

హైటెక్ సిటీలో భారీ కూల్చివేతలు 

రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మాదాపూర్ హైటెక్ సిటీ మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా గురువారం హైడ్రా కాపాడింది. అధికారుల అంచనా ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.2,200 కోట్లు. ఖానామెట్ పరిధిలోని సర్వే నంబర్లు 53, 55లో అక్రమ కట్టడాలు వెలిసినట్టు ప్రజావాణిలో ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.

చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్లు, మెకానిక్ కేంద్రాలు, ఐరన్, స్టీల్ దుకాణాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య వందలాది షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను తొలగించారు. ఆక్రమణలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సేకరించిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన అధికారులు గత నెల నిర్వహించిన విచారణలో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపుతూ చుట్టుపక్కల భూమిని ఆక్రమించి నెలకు భారీ అద్దెలు వసూలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా గుర్తించారు.