ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
24-07-2026 08:16 PM
- ప్రొఫెసర్ కోదండరాంకు వినతి
ఆలేరు, జులై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్, హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు, స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు ఇవ్వాలని సీస మహేశ్వరి ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా హామీలు అమలు కాలేదని, జైలుకు వెళ్లి, లాఠీ దెబ్బలు తిని, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళలు, గృహిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసాగాల అనసూయ, అరుణ తదితరులు పాల్గొన్నారు.






