ఈనెల 24న ప్రజావాణి కార్యక్రమం
23-08-2026 05:34 PM
ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఆదివాసీ తుడుందెబ్బ ధర్నా , ఐటీడీఏ కార్యాల ముట్టడి నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఐటిడిఎ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి రావాలని తెలిపారు.






