గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ
15-03-2026 05:23 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత, ప్రజా సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి వారికి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంధం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, వార్డు సభ్యులు గడ్డం లహరి, చౌదరి పద్మ, గంధం లక్ష్మి, గంధం రమేష్, పొన్నాల అమృత, గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మి, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.




