21 April, 2026 | 9:09 AM

స్వామివారి సేవలో పూనమ్ కౌర్

21-04-2026 02:53 AM

ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటి  

వేములవాడ, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేముల వాడలోని ప్రసిద్ధ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామిని సినీనటి పూనమ్ కౌర్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి ఆశీస్సులు పొందేందుకు కోడె మొక్కులు సమర్పించిన పూనమ్ కౌర్, దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ దర్శనం సందర్భంగా ఆలయంలో భక్తులతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.