11-02-2026 12:06:08 PM
* ఓటు హక్కు ను వినియోగించుకోన్న జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికల్లో బాగంగా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం అయింది. 49 వార్డుల్లో మొత్తం 314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం స్థానిక సాత్నాల క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వార్డు నంబర్ 38, పోలింగ్ స్టేషన్ నంబర్ 170 వద్ద ఆయన సామాన్య ఓటరుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.