24 April, 2026 | 6:11 PM

Breaking News

నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలి

30-09-2025 07:14 PM

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

చిలుకూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిలుకూరు మండలంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని గులాబీ జెండాను ఎగరవేయాలని, మంగళవారం జరిగిన బీఆర్ఎస్ చిలుకూరు మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని గ్రామపంచాయతీ, మండలంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కినపల్లి జానకి రామాచారి, కార్యదర్శి అంబాల రాంబాబు, పిఎసిఎస్ చైర్మన్ అలస కాని జనార్ధన్, జానీ మియా, బట్టు శివాజీ, దొడ్డ సురేష్, అన్నపూర్ణ, తాళ్లూరి శ్రీను, పాషా, బెల్లంకొండ నాగయ్య, అచ్చయ్య, పాల్గొన్నారు.