జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
21-04-2026 03:45 PM
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోంది
హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(Congress Party Political Affairs Committee) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కర్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. ఇటీవలే రూ. 200 కోట్లతో కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని వినతులు వచ్చాయని వెల్లడించారు. నారాయణఖేడ్ ఆస్పత్రిలో మరో 50 పడకలు మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన అన్నారు.






