2 July, 2026 | 12:29 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం కోర్టులో పిటిషన్లు

28-01-2026 12:30 AM

న్యూఢిల్లీ, జనవరి ౨౭: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల విడుదల చేసిన ‘ఈక్విటీ’ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలైంది. యూజీసీ నిబంధనలు కేవలం కొన్నివర్గాలకే రక్షణ కల్పించి, మిగిలిన వారిని విస్మరిస్తున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించడం కోసమే ఈ నిబంధనలు తెచ్చామని యూజీసీ చెప్తున్నదని, కానీ.. జనరల్ కేటగిరీ విద్యార్థుల సంగతేంటని ఆ వర్గం విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదు చేసే అవకాశం ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఉన్నట్లే, తమకూ ఫిర్యాదు చేసే అవకాశ ఉండాలని నొక్కిచెప్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు కేంద్ర విద్యాశాఖ మాత్రం కొత్త నిబంధనలు ఎవరికీ వ్యతిరేకం కావని స్పష్టం చేస్తున్నది. రోహిత్ వేముల, పాయల్ తడ్వి వంటి వారి బలవన్మరణాల తర్వాత, మరో విద్యార్థి అలా వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతోనే కొత నిబంధనలు తెచ్చామని చెప్తోంది. ఈ  నేపథ్యంలోఅత్యున్నత న్యాయస్థానం పిటిషన్లపై ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.