13-02-2026 03:58:03 PM
మోతె, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో మోతె గ్రామానికి పర్మినెంట్ గ్రామ కార్యదర్శి ని నియమించాలని కోరుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉపసర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డిలు యం పి డి ఓ ఆంజనేయులు కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి లు మాట్లాడుతూ మండల కేంద్రంలో పర్మినెంట్ కార్యదర్శి ని ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇంచార్జీ కార్యదర్శితో ఇబ్బందులు పడుతున్నామని పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే గ్రామ కార్యదర్శిని నియమించి గ్రామ పరిపాలన కు ఆటంకం లేకుండా చూడాలని యం పి డి ఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు వీరబాబు, తరుణ్, నవీన్, రమేష్, యశోద, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.