పెండింగ్ ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలి
నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సుమారు ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల సమస్యలను తెలుసుకొని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సూరజ్ నాయక్, సాత్విక్, BJYM నాయకులు కందుల హరీష్, వెంకటేష్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






