12-02-2026 12:00:00 AM
పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు
చేవెళ్ల ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాల్ కు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఓటర్లు - 25,371/- ఓటర్లు ఉండగా 20,531/- ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుండి మందకోడిగా సాగిన పోలింగ్ ఓటింగ్ సమయం ముగిసేసరికి 80.92% (81శాంతం) పోలింగ్ జరిగింది. పురుషులు 12,579ఉండగా మహిళాలు,12,791 ఉంటే, అదర్స్ ఒక్కరు ఉన్నారు.
అయితే పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు సందర్శించారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పడిన పూర్తి చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు 16,17,18, వార్డుల ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు.
ఓటింగ్ లో పాల్గొన్న 18 వార్డులకు గాను ఓటర్లు 81శాంతం ఓటింగ్లో పాల్గొన్నారు. అంకెల తారుమారు చేసి విలక్షణమైన ఓటింగ్ పర్సంటేజ్ని ఇచ్చారు. అయితే నామినేషన్లకు ముందు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులు అమ్ముకుంటున్నారన్న పుకార్లు వినిపించాయి. మొత్తం ఓట్లలోంచి పోలైన ఓట్లు తీసేయగా 4,840 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల సంఖ్య ఎకరం విస్తీర్ణంకు గజాల్లో మ్యాచ్ కావడం గమనార్హం.
మొత్తం ఓటర్లు - 25,371
పోలైన ఓట్లు - 20531
పోల్ కాని ఓట్లు - 4840
పోలింగ్ కేంద్రాలు - 37
ఓటింగ్ శాతం 80.92%