9 March, 2026 | 11:48 PM

మార్చి 17న ‘చలో హైదరాబాద్’కు పంచాయతీ కార్మికుల పిలుపు

09-03-2026 09:37 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): పంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ ద్వారా చెల్లించాలని మార్చి 2న ప్రభుత్వం జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 17న నిర్వహించే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి తంగళ్లపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు కూడా వెళ్లనున్నట్లు మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.