11-02-2026 02:19:04 AM
గ్రూప్ ఏలో టాప్ ప్లేస్
కొలంబో , ఫిబ్రవరి 10 : టీ20 ప్రపంచకప్ లో యూఎస్ఏ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్లో భారత్పై ఆకట్టుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన సయీమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా(1) వెంటవెంటనే ఔటయ్యారు.
ఈ దశలో ఫర్హాన్, బాబర్ అజామ్ పాక్ను ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..బాబర్ అజామ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 46 రన్స్ కు వెనుదిరిగాడు.
చివర్లో షాదాబ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన యూఎస్ఏ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ఆడ్రియస్ గౌస్ , జహంగీర్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించారు. గౌస్ (13) పరుగులకే ఔటవగా... కెప్టెన్ మోనాంక్ పటేల్ (3) నిరాశపరిచాడు. యూఎస్ఏ 20 ఓవర్లలో 158 పరుగులే చేయగలిగింది.