వెనిజులా నుంచి భారత్కు చమురు
దేశానికి మూడో అతిపెద్ద చమురు సరఫరాదారు
న్యూఢిల్లీ, మే ౨౨: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో భారత్ ప్రత్యామ్నా య మార్గాల ద్వారా చమురు సేకరిస్తున్నది. దీనిలో భాగంగానే చమురు దిగుమతికి వెనిజులా వైపు మొగ్గుచూపింది. మొదట సాధా రణంగా ప్రారంభమైన దిగుమతి క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అది ఎంతగా అంటే.. ఇప్పుడు భారత్కు చమురు సరఫరా చేసే దేశాల్లో వెనిజులా మూడోస్థానానికి చే రుకుని సౌదీ అరేబియా, అమెరికా దేశాలను సైతం వెనిజులా వెనక్కి నెట్టింది.
భారత్కు ఒక ఈ నెలలోనే వెనిజులా నుంచి సుమారు ౪.౧౭ లక్షల బ్యారెళ్ల ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను దిగుమతి చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఆ దిగుమతి ౪౭శాతం ఎక్కువ. రష్యా చమురుతో పోలిస్తే వెనిజులా ముడి చమురు చాలా తక్కువ ధర కు లభించడం మరో విశేషం.






