24 August, 2026 | 11:38 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి

24-08-2026 10:30 PM

ప్రజావాణిలో సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ వినతి

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని పరుశురాంపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ సోమవారం గణపురం ప్రజావాణిలో ఇంచార్జ్  ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరుశురాంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు.

ఈ విషయమై ఆగస్టు 14న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో  చర్చించినప్పటికీ, ఆగస్టు 21న జారీ చేసిన అంగన్‌వాడీ పోస్టుల నోటిఫికేషన్‌లో పరుశురాంపల్లి ఖాళీ పోస్టును చేర్చలేదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ ఇన్చార్జి  ఎంపీడీవో కు విజ్ఞప్తి చేశారు.