వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): నేరాల దర్యాప్తులో పోలీసులకు సకాలంలో సహకరించిన వీఎస్టీ కాలనీ అధ్యక్షుడు అజెండ్ల సుధాకర్ను ఉప్పల్ ఏసీపీ వేంకట్ రెడ్డి అభినందించారు. నాచారం వీఎస్టీ కాలనీలో నమోదైన క్రైమ్ నం. 407/2026 కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ అందించి నిందితుడిని గుర్తించడం, అరెస్టు చేయడం, కేసు ఆస్తుల రికవరీలో సహకరించినందుకు ఆయనకు మల్కాజిగిరి కమిషనరేట్ తరఫున ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ వేంకట్ రెడ్డి మాట్లాడుతూ.... నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసు దర్యాప్తు మరింత వేగవంతంగా సాగుతుందని అన్నారు. సమాజ భద్రత కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాచారం సీఐ ధనంజయ్ గౌడ్, డీఐ మాన్సింగ్, సబ్ ఇన్స్పెక్టర్లు ఫ్రాన్సిస్, ప్రభాకర్ రెడ్డి, మైబెల్లీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా భద్రతకు సహకరించిన అజెండ్ల సుధాకర్ సేవలను అధికారులు ప్రశంసించారు.






