ప్రశాంతంగా నీట్ ప్రవేశ పరీక్ష
04-05-2026 03:04 AM
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మహబూబ్ నగర్ మే 3 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నీట్ పరీక్ష జరుగుతున్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎం వి ఎస్ డిగ్రీ కళాశాల , ప్రభుత్వ మోడల్ బేసిక్ హై స్కూల్ లలో గల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ పరిశీలించి సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష లో మొత్తం 4,214 మంది అభ్యర్థులకు గాను వారిలో 4,141 మంది పరీక్షకు హాజరయ్యారు. 73 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.






