2 July, 2026 | 2:57 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

పురపాలికల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి

01-01-2026 12:00 AM

కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల, డిసెంబర్ 31 (విజయక్రాంతి): పురపాలికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికలు, పురపాలికల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై  జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పురపాలికల్లో ఉన్న వార్డుల వారీగా ఓటర్ల ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు, మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు.

ఒక్కో వార్డులో 850కు పైగా ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా పురపాలికల్లో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది స్థానికులు కాకుండా ఇతర మండలాల వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ పురపాలికల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో ఎన్నికల కోడ్ వచ్చేలోగానే టెండర్ పూర్తయి పనులు ప్రారంభించేలా మొత్తం ప్రక్రియను సంబంధిత ఇంజనీర్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సీసీ రహదారులు, మురుగు కాలువలు, పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, తదితర పనులు చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో స్థలం సమస్య లేకుండా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఆయా అభివృద్ధి పనులకు టెక్నికల్ శాంక్షన్ పూర్తి చేసుకుంటే మిగిలిన ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. అన్ని పురపాలికల్లో జనవరి 20వ తేదీలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభం కావాలని, అలసత్వం వహించే ఇంజనీర్లపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్ సాగర్, శంకర్ నాయక్, సైదులు, రాజయ్య, డిఈ క్రాంతి, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.