రామచంద్రపూర్లో జాతీయ ఉపాధి హామీ పనుల ప్రారంభం
25-02-2026 03:46 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను గ్రామ పాలకవర్గం ప్రారంభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ గంధం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామంలోని కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, వార్డు సభ్యులు గడ్డం లహరి, గంధం లక్ష్మి, గంధం రమేష్, పత్తం శేఖర్, పొన్నాల అమృత పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి, BRS గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి, ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణచందర్ మరియు ఉపాధి హామీ సిబ్బంది హాజరయ్యారు.




