ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలానికి మొదటి స్థానం
సంబరాలు జరుపుకున్న ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శులు
నాగిరెడ్డిపేట్, మే 5 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డి పెట్ మండలం మొదటి స్థానంలో ఉందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలు కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శులు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్కు శాలువాతో సన్మానించి కేకు కట్ చేశారు. నాగిరెడ్డిపేట్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చురుకుగా జరిగేందుకు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయడం వల్లే నాగిరెడ్డిపేట్ మండలం కామారెడ్డి జిల్లాలో ముందు ఉందని కార్యదర్శులు తెలిపారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో 363 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు అందులో 355 ఇండ్లు మార్కౌట్లు ఇవ్వగా,బిస్మిట్ లేబర్లో 72 ఇండ్లు ఉన్నాయని,రూప్ లెవెల్లో 43 ఇండ్లు పనులు కొనసాగుతున్నాయని,స్లాబ్ లేవలో 137 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఇప్పటివరకు నాగిరెడ్డిపేట మండలంలో 62 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలం కామరెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి, కార్యదర్శులు సంతోష్ కుమార్, తిరుపతి, అశోక్, వెంకట్ రాములు, రమేష్, రవీందర్, సరేందర్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, శంకర్, అజ్ముద్దీన్, వనజ, మమత, పవిత్ర, రజిత, సుజాత, సావిత్రి, అనిత తదితరులు ఉన్నారు.






