calender_icon.png 6 February, 2026 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను తనిఖి చేసిన ఎంపీడీవో

06-02-2026 09:48:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని అచ్చయపల్లి,బొల్లారం, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అకస్మాతిగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు సరఫరా స్వచ్ఛమైన నీరును విద్యార్థులకు అందించాలన్నారు.అచ్చయ పల్లి గ్రామ ట్యాంకు లీకేజీలను పరిశీలించి లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలన్నారు. బొల్లారం పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఎంపీడీవోలు శాలువతో ఘనంగా సన్మానించారు.

అలాగే గ్రామాలలో కూడా నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు ఇప్పటినుండే ఏర్పాటు చేసుకోవాలన్నారు.గ్రామాలలో మురికి కాలువలు,పరిసరాలు పరిశుభ్రత,చెత్త సేకరణ వివిధ పనులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం రాఘవపల్లి గ్రామంలో నర్సరీని పరిశీలించి నర్సరీలో ఉన్న మొక్కలకు ఉదయం సాయంత్రం వేళలో సరిపడా నీటిని అందించాలని నర్సరీలో ఉన్న ప్రతి మొక్కను చనిపోకుండా బతికించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు బెస్త సాయిలు, ప్రభు గౌడ్,కార్యదర్శులు వెంకట్ రాములు,సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్లు ఫర్వినా బేగం,బెస్త మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.