ట్రంప్ మీటింగ్ లో కాల్పుల ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో జరిగిన కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్షేమంగా ఉండటం పట్ల ఆయన ఊరట చెందారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, హింసను నిస్పందేహంగా ఖండించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
శనివారం రాత్రి ఒక వ్యక్తి భద్రతా సిబ్బందిపై షాట్గన్తో కాల్పులు జరపడంతో, ట్రంప్, మెలానియా ట్రంప్లను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు విందు నుంచి బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలు ధరించిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై కాల్పులు జరిపాడని ఎఫ్బిఐ అధికారి రాయిటర్స్కు వెల్లడించారు. బుల్లెట్ప్రూఫ్ జాకెట్ వల్ల ఆ అధికారి ప్రాణాలతో బయటపడ్డారని, ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.






