మల్లికార్జున కర్గే కు వివాహ ఆహ్వానాన్ని అందించిన జుక్కల్ ఎమ్మెల్యే
03-08-2026 04:19 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): జుక్కల్ శాసనసభ్యులు తోటి లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహం ఆహ్వాన పత్రికను సోమవారం రోజు న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఖర్గేకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజం గారి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.






