ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
31-08-2026 09:06 AM
రుద్రంగి ఆగష్టు30(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా,ట్రైబల్ వెలిఫెర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.పాఠశాల భవనంతో పాటు వసతి గృహాల నిర్మాణలు 100శాతం పూర్తి అయ్యాయని అన్నారు. విద్యుత్, రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. బిఆరెస్ ప్రభుత్వంలొనే ఉమ్మడి మానాల అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో,బిఆరెస్ సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు...






