సుడా, గ్రంథాలయ చైర్మన్లను అభినంధించిన మంత్రి తుమ్మల
08-05-2026 12:00 AM
ఖమ్మం, మే 7 (విజయక్రాంతి): ఖమ్మం సుడా చైర్మన్ గా ఎన్నికైన పువ్వాళ్ళ. దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన మహ్మద్ ఖాదర్ అలీ లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. గురువారం ఖమ్మం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను నూతన చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు తమ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తుమ్మల పువ్వాళ్లను, ఖాదర్ అలీని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయల. నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర, జిల్లా, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






