జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలి.. మనసులో మాట చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
17-03-2026 03:08 PM
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో(Assembly Lobby) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) చిట్ చాట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని(Jaggareddy ) నియమించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కోమటిరెడ్డి కోనియాడారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.




