10 April, 2026 | 3:50 PM

Breaking News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •  

సబ్ జైల్‌లో మెగా హెల్త్ క్యాంప్

10-04-2026 12:46 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబాబాద్ సబ్ జైల్లో గురువారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జైలర్ మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా హెల్త్ క్యాంప్ లో ప్రభుత్వ వైద్యాధికారుల బృందం పాల్గొని, జైల్లోని ఖైదీలకు అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జైలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్యాధికారుల సహకారంతో విచారణ ఖైదీలకు మొబైల్ ఎక్స్ రే మెషీన్లతో పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ పట్టేం బిక్షపతి, వడ్డేబోయిన శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్లు ఏ.అర్జున్, అనిత, ప్రియాంక, కళ్యాణి, మౌనిక, అన్నపూర్ణ, శివరాం, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.