సుల్తానాబాద్లో గంజాయి మొక్కల కలకలం
05-04-2026 12:09 AM
స్వాధీనం చేసుకున్న పోలీసులు
సుల్తానాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల శివారులో ఉన్న సాయిరాం బ్రిక్స్లో శనివారం గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ సంఘటన సుల్తానాబాద్ లో కలకలం రేపింది, ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల మేరకు బ్రిక్స్లో పని చేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికుడు మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు మొక్కలు పెంచుతున్న స్థలానికి చేరుకుని మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. దాదాపు వీటి విలువ 50 వేల రూపాయల వరకు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు.




